ముమ్మరంగా సాగుతున్న పనులు
ఓర్వలేకనే నాయకుల ఆరోపణలు
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కోస్గి, ఏప్రిల్ 19 : టీఆర్ఎస్ పాలనలోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలో పలు వార్డుల్లో సీసీ రో డ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలను సోమవారం ప్రారంభించా రు. అనంతరం 7వ వార్డులో మున్సిపాలిటీకి కేటాయించి న పది శాతం భూమిని షెటిల్ కోర్టుగా మార్చి యువకుల కు మంచి ఆటస్థలంగా ఇవ్వాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామిను ఆదేశించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇది చూసి ప్ర తిపక్ష నాయకులు అనవసరంగా ఆరోపణలు చే స్తున్నారని, ప్రజలు దీనిని గమనించి అభివృద్ధి కి సహకరించాలన్నారు. త్వరలోనే మంత్రి కేటీఆర్తో బస్టాండ్, బస్ డిపో, కూరగాయల షెడ్ల ను ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే మరో రూ. 15 కోట్లతో పట్టణంలోని రోడ్డు వైడింగ్ చేస్తామన్నారు. పోతిరెడ్డిపల్లికి సర్జాఖాన్పేట రోడ్డు నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కేటీఆర్తో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సం స్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్స న్ శిరీష, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మ న్ వేణుగోపాల్, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యుడు ఓంప్రకాశ్, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సీఎం కేసీఆర్కు కరోనా.. త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్
చెన్నైకి ఆదిలోనే షాక్.. మళ్లీ నిరాశపరిచిన గైక్వాడ్