యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 7,91,225 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 80,510, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 21,500, వేద ఆశీర్వచనం ద్వారా 8,772, సుప్రభాతం ద్వారా 200, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 30,000, వ్రత పూజల ద్వారా 29,000,
కల్యాణ కట్ట టిక్కెట్ల ద్వారా 12,800, ప్రసాద విక్రయాల ద్వారా 3,67,620, వాహన పూజలతో 8,000, టోల్ గేట్ ద్వారా 660, అన్నదాన విరాళాల ద్వారా 12,150, సువర్ణ పుష్పార్చల ద్వారా 82,380, యాదరుషి నిలయం ద్వారా 31,450, పాతగుట్ట నుంచి 23,735, ఇతర విభాగాల ద్వారా 50,032 మొత్తంగా రూ. 7,91,225 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.