బీబీనగర్, జూన్23: బీబీనగర్ పట్టణంలోఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బుధవార పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిం చారు. ఇందులో భాగంగా బీబీనగర్ పట్టణంలో రూ.6.5 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను, రూ.19 కోట్ల ఆర్ఆండ్బీ నిధులతో చేపట్టిన ఆర్ వోబీ నిర్మాణాలు, పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ కమిటీ హాల్ను ప్రారంభించారు. అనంతరం పల్లె బాట కార్యక్రమంలో భాగంగా పట్టణం లోని పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి వ్యవస్థ పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అ నంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా బీబీనగర్ పట్టణ శివారులో ఒక మొక్కను నాటారు, ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను నాటి సం రక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నరావులపల్లి గ్రా మానికి చెందిన అశోక్కు సీఎం సహాయనిధి నుంచి మంజూ రైన రూ.20,000 చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజే శారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ స్థ్ధాయి సంఘం చైర్మన్ జడ్పీటీసీ గోళి ప్రణీత పింగళ్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, సీఏసీయస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్ రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యక్ష్మి శ్రీనివాస్, దస్తగిరి, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు మంగ లింగేశ్, పొట్ట అంజి, నెల్లుట్ల శ్రీశైలం, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి చింతల సుదర్శన్రెడ్డి, నారగోని మహేశ్, ఎండీ అక్బ ర్, గోలి సంతోష్ రెడ్డి, మంచాల రవి కుమార్, మస్తాన్, సన్ని బోయిన ప్రసాద్, కాసుల సత్యనారాయణ, మంగ అశోక్, మో యిన్, ఎలుగల నరేందర్, మన్నె బాల్ రాజ్, అధికారులు తది తరులు పాల్గొన్నారు.