ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్
మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకేలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు పని చేస్తున్నదని అదేవిధంగా నూతన పాలకవర్గం రైతులకు అండగా ఉంటూ పనిచేయాలని ప్రభుత్వ విప్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే గాదరి ఈ సందర్భంగా వారికి సూచించారు.
ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు, ఇతర మండల పరిసర గ్రామాల రైతులకు మోత్కూరు వ్యవసాయ మార్కెట్ అందుబాటులో ఉంటుందని, రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధరను కల్పించి కొనుగోలు చేయడం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నూతన పాలకవర్గం పని చేసి ప్రజల, రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, అడ్డగూడూరు సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పొన్నేబోయిన రమేశ్, కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.