మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ను పరిశీలించారు.
మినీ ట్యాంక్ బండ్ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలను నాటించాలని, పట్టణ వాసులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ మహమూద్ను ఆదేశించారు. డంపింగ్ యార్డు, పట్టణ ప్రకృతి వనంను పరిశీలించారు.
పశువుల సంతలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేయనున్న సమీకృత మార్కెట్ స్థలాన్ని, రూ.కోటితో అభివృద్ధి చేయనున్న వైకుంఠధామాన్ని పరిశీలించారు. పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైనందున పనులు ప్రారభించే విధంగా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
పట్టణ ప్రగతి, పారిశుధ్యం, తాగు నీటిని క్లోరినేషన్ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అనంతరం మున్సి పల్ కార్యాలయాలంలో పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి పాల్గొన్నారు.