YS Jagan | ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు వైఎస్సార్పీసీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత పులివెందులలోని సెక్రటేరియట్ కాంప్లెక్స్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను ఉన్నతాధికారులకు సీఎంవో అధికారులు పంపారు.
షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 7.45 గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు పయనమవుతారు. ఎయిర్పోర్టు నుంచి ఉదయం 8.15 గంటలకు కడపకు బయలుదేరుతారు. 9.05 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.10 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో పులివెందుల నియోజకవర్గం భాకరాపురం పయనమవుతారు. 9.40 గంటలకు భాకరాపురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. 9.50 గంటలకు పులివెందుల సీఎస్ఐ మైదానంలో బహిరంగ సభకు హాజరవుతారు. 10 గంటల నుంచి 11.15 గంటల వరకు జరిగే సభలో పాల్గొంటారు.
ఉదయం 11.15 గంటలకు నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. 11.25 గంటల నుంచి 11.40 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత 11.45 గంటలకు భాకరాపురంలోని నివాసానికి చేరుకుంటారు. 11.45 నుంచి 12.15 గంటల వరకు విరామం తీసుకొని.. 12.25 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్కు చేరుకొని.. 12.30 గంటలకు కడప ఎయిర్పోర్టుకు హెలికాప్టర్లో పయనమవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి గన్నవరానికి వెళ్తారు. గన్నవరం నుంచి తాడేపల్లి చేరుకుంటారు.