నల్లగొండ రూరల్, ఏప్రిల్ 23 : నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ కార్యక్రమం మంగళశారం అట్టహాసంగా సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ఉదయం నుంచే తరలివచ్చిన గులాబీ సైన్యంతో నల్లగొండలో భారీ సందడి నెలకొంది. ఎటుచూసినా గులాబీ జెండాలు చేతబట్టి బైక్లపై కార్యకర్తలు తరలిరావడం కనిపించింది. ముందే నిర్దేశించిన విధంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మి గార్డెన్స్ ఆవరణకు చేరుకుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారీ బైక్ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ ముఖ్యులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి బయల్దేరారు. ప్రచార రథంపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డితోపాటు అభ్యర్థి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర నాయకుడు రాంచందర్నాయక్ పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వీరికి ముందు బైక్ర్యాలీలో కొద్దిదూరం వెళ్లాక నోముల భగత్కుమార్ బుల్లెట్ నడపగా వెనుకాల కంచర్ల భూపాల్రెడ్డి కూర్చుని కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు ర్యాలీలో కదం తొక్కారు. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా ముందుకు సాగారు. లక్ష్మి గార్డెన్స్ నుంచి ఎన్జీ కాలేజ్, క్లాక్టవర్ సెంటర్, డీఈఓ ఆఫీసు మీదుగా బైక్ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. బీఆర్ఎస్ బైక్ ర్యాలీతో పట్టణం గులాబీమయంగా మారింది.
రెండు సెట్ల నామినేషన్ల దాఖలు..
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ర్యాలీకి ముందుగా ఒక సెట్ నామినేషన్ వేశారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు చకిలం అనిల్కుమార్, కటికం సత్తయ్యగౌడ్, మామిడి పిచ్చయ్యతో కలిసి కంచర్ల కృష్ణారెడ్డి తన తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీ అనంతరం మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్తో కంచర్ల కృష్ణారెడ్డి మరో సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. అంతకు ముందు తన స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్లలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో కంచర్ల కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తన తల్లి కౌసల్యకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుని నల్లగొండలో నామినేషన్ వేసేందుకు వచ్చారు.
నల్లగొండ వీటీ కాలనీలోని ఆలయంలోనూ నామినేషన్ పత్రాలతో కంచర్ల సోదరులు ప్రత్యేక పూజలు చేసి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కటికం సత్తయ్యగౌడ్, రేగట్టే మల్లికార్జున్రెడ్డి, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్రెడ్డి, దేప వెంకట్రెడ్డి, కరీంపాషాతోపాటు నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.