మెదక్ : ప్రమాదవాశాత్తు రైలు ఢీకొని(Train accident) యువతి మృతి(Woman dies) చెందిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్(Medak) జిల్లా నార్సింగ్ మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన పంబల్ల రమ్య (18) మధ్యాహ్నం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తున్న క్రమంలో కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొని రమ్య అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ ఘటనా స్థలం చేరుకొని పంచనామ నిర్వహిం చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా హాస్పిటల్కు తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.