రాజాపేట, ఏప్రిల్ 23 : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతుల కండ్లల్లో ఎనలేని ఆనంద వెల్లివిరిసిందని, కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో సాగునీళ్లు లేక రైతుల కండ్లల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయని భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. మంగళవారం రాజాపేట మండల కేంద్రంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ అంటనే కరువుకు మారుపేరని, నాలుగు నెలల్లోనే గత పదేండ్లలో ఎప్పుడూ లేని కరువు తాండవిస్తుండడంతో సాగు, తాగు నీటి కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారన్నారు. అబద్ధాలకు కేరాఫ్ రేవంత్రెడ్డి అని, స్థాయిని మరిచి మాట్లాడుతున్న సీఎంకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తనను ఆశ్వీరదిస్తే మీ సేవకుడిగా పనిచేస్తూ ప్రజల తరఫున పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు. లక్ష మెజార్టీతో విజయం తనదేనని, భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25 భువనగిరిలో సాయంత్రం 6 గంటలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షోను బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, ప్రధాన కార్యదర్శి నక్కిర్త కనకరాజు, సట్టు తిరుమలేశ్, రేగు సిద్ధులు, రామిండ్ల నరేందర్, మేక వెంకటేశ్వర్రెడ్డి, రాపోలు తిరుపతిరెడ్డి, విజయ్కుమార్, డొంకెన మహేందర్గౌడ్, కటకం స్వామి, ఎర్రగోకుల జశ్వంత్, ఉప్పలయ్యగౌడ్, కొన్యాల మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, బోనాల వెంకటేశ్ పాల్గొన్నారు.