వేలేరు : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం పై బీజేపీ పోరుబాట కార్యక్రమం చేపట్టిందన్నారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర ఆదేశాల మేరకు వేలేరు మండల అధ్యక్షుడు రాజు యాదవ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల ఇంచార్జ్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్దానాలు, అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీత, దుర్గాప్రసాద్, సురేష్, శివాజీ, కిరణ్, రాజు, రాహుల్, శ్రీకాంత్, రమేష్, పాల్గొన్నారు.