Athletics | హనుమకొండ చౌరస్తా, జనవరి 10: బెంగుళూరు రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్లో ఈ నెల 14 వరకు జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్కు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై వెంకయ్య తెలిపారు.
మెన్స్లో వరంగల్ కిట్స్ కాలేజీ నుంచి ఏ గౌతమ్, ఖమ్మం డిగ్రీ కాలేజీ నుంచి బి రోషన్, సీహెచ్ వినయ్, పాల్వంచ డిగ్రీ కాలేజీ నుంచి డి వివేక్చంద్ర, ఎం అఖిల్, కొత్తగూడెం ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ నుంచి ఎస్ గోపిచంద్, ఎస్సీ రాంపూర్ చైతన్య ఇనిస్టిట్యూట్ ఫార్మసీ నుంచి ఆర్ అభినయ్, వి గణేష్ ఉన్నారు.
ఉమెన్స్లో మంచిర్యాల ఎంఐఎంఎస్ నుంచి ఏ మైతిలి, వరంగల్ వెస్ట్ టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ(డబ్ల్యూ) నుంచి బి శృతి, వైరా శ్రీచైతన్య డిగ్రీ కాలేజీ నుంచి సీహెచ్ కీర్తన ఉన్నారని.. వీరికి కేయూ ఎడ్యుకేషన్ కాలేజీ నుంచి ఫిజికల్ డైరెక్టర్ ఎన్ సుమన్ మేనేజర్గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.