వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో మంగళవారం ఉదయం ఒక ఎలక్ట్రిక్ (బ్యాటరీ బండి) ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంద గ్రామానికి చెందిన పోశాల సూర్యనారాయణ తన బ్యాటరీ బండిని ఇంటి ఆరుబయట నిలిపి ఉంచారు.
అయితే, ఊహించని విధంగా ఆ బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.