వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన ఆత్మకూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన అడప సాంబయ్య (65), అతని కుమారుడు కృష్ణ (22) ఇద్దరూ పురుగుల మందు తాగడంతో దవాఖానకు తరలిస్తుండగా సాంబయ్య మృతి చెందాడు. కృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. పురుగుల మందు తాగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.