మంగపేట : మంగపేట మండలంలో ములుగు అదనపు కలెక్టర్ ఈలా త్రిపాఠి పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని గంపోనిగూడెం శివారులో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం గంపోనిగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు పౌష్టికాహార పంపిణీ, అంగన్వాడీ కేంద్ర పని తీరును పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి మల్లూరు గ్రామ శివారులోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి, స్థానిక అధికారులతో కలిసి మొక్కలు నాటి, అధికారులకు పలు సూచనలు చేశారు.
అదనపు కలెక్టర్ వెంట తాసిల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీవో కర్నాటి శ్రీధర్, ఎంపీవో బెహరా శ్రీకాంత్నాయుడు, ఏపీవో భవాని, ఆర్ఐ కామేశ్వర్రావు, పంచాయతీ కార్యదర్శి హీరునాయక్ తదితరులు ఉన్నారు.