మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. భోజ్య తండాలో కరెంట్ షాక్కు గురై ఇద్దరు యువ రైతులు మరణించారు. ఇవాళ ఉదయం తండాకు చెందిన భూక్య సుధాకర్, మాలోతు యాకూబ్ ఇవాళ ఉదయం తమ పొలం వద్దకు వెళ్లారు. పోలంలోని బోరు స్టార్టర్కు ఉన్న ఫీజులు పోవడంతో వాటికి వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బోరుకు తాకి ఉన్న జే వైరుకు విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో ఇద్దరు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు.