మహబూబాబాద్ : బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని మదర్ థెరిసా సెంటర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టి బొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడారు.
కిషన్ రెడ్డి అవివేకి. నిజాన్ని మరుగున పడేసేoదుకే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. చట్టాలను మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు. రాజ్యాంగబద్ధంగా దక్కిన హక్కును బీజేపీ తుంగలో తొక్కుతున్నదని. నాణ్యమైన ఇనుము కాకపోతే 56 వేల హెక్టార్ల భూమిలో 4 లక్షల టన్నులు ప్రైవేట్ కంపెనీ ఎలా దోచుకెళ్లింది.
ఖనిజ సంపద జాతీయ సంపద అయినప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడంలో అభ్యంతరం ఏమిటి? అని ప్రశ్నించారు. బీజేపీ చేతగాని తనంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుందన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.