మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మూర్చవ్యాధితో (ఫిట్స్) ఓఅధ్యాపకురాలి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కురవి మండలం సీరోలు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీరోలు గ్రామంలోని ఏకలవ్య గిరిజన బాలికల మోడల్ గురుకుల పాఠశాల(కళాశాల)లో ఎకనామిక్స్ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న మార్గం సౌజన్య ఫిట్స్ రావడంతో అదే గ్రామంలో నివాసం ఉంటున్న తన గదిలో మృతి చెందారు. కాగా, సౌజన్య స్వగ్రామం తొర్రూరు మండలంలోని చిట్యాల.