మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందించి మాట నిలబెట్టుకున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి,
వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్, స్థానిక కౌన్సిలర్లు గోగుల అనురాధ, బాలు, కర్పూరపు పద్మ, మంగళంపళ్లి రాజ్ కుమార్, గోపి, మైస నాగయ్య పాల్గొన్నారు.