మహబూబాబాద్ : నూతన పెన్షన్ కార్డులను మహబూబాబాద్ మ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ లో మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద 21.94 లక్షల రూపాయలతో మంజూరు అయిన ప్రాథమిక పాఠశాల సమగ్ర అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మర్నేని వెంకన్న, గద్దె రవి, ఫరీదా, బాలు, గోగుల రాజు, మర్నేని రఘు, వెంకన్న, శంకర్, మంగళం పల్లి రాజు, మర్నేని కిరణ్, అమీర్, తదితరులు పాల్గొన్నారు.