మహబూబాబాద్ : నరసింహులపేట మండల కేంద్రంలో మంద సత్యం అనే రైతు తన పంట పొలంలో పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ ప్రభుత్వం తనకు తోట పెంపకం కోసం పొలం గట్ల వెంబడి టేకు మొక్కల పెంపకానికి మొక్కలు ఇచ్చిందని తెలిపారు. అలాగే వాటిని పెంచుకున్నందుకు డబ్బులు ఇచ్చారని, దీనికితోడు పశువుల నీడ కోసం షెడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ తన పంట పొలంలో జాతీయ జెండా ఎగురవేసి కుటుంబ సభ్యులతో సంబురాలు చేసుకున్నారు.