మహబూబాబాద్, ఆగస్ట్ -13 : పంద్రాగస్టు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కె. శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియంలో పంద్రాగస్టు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ నెల 15న మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్.టి.ఆర్. స్టేడియం లో ఉదయం 10-30 గంటలకు జాతీయ పతావిష్కరణ చేస్తారని, కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.