Farmers Protest | రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు ధర్శనమిస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యాడ్ తో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోలు విషయంలో చూపిస్తున్న మొండివైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
వనపర్తి మండలం రాజపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు వనపర్తి–కొత్తకోట వెళ్లే రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి తమ నిరనస తెలియజేశారని తెలిసిందే. ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్రం తండా పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. 40 రోజులైనా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని, ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఎలా ఉందో అద్దం పట్టే ఈ దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నరైతుల పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టిన రైతులు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్రం తండా పీఏసీఎస్ కేంద్రం వద్ద ధర్నాకు దిగిన రైతులు
40 రోజులైనా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని, ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి రైతుల నిరసన pic.twitter.com/veg3qP3lRI
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026