జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్ల పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య అనే రైతు ఉదయం మిరప తోట పెట్టేందుకు వెళ్తున్న క్రమంలో..ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో పంట పొలంలోనే మృతి చెందాడు. కొమురయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.