జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని రేగొండ మండలం కనపర్తి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కనపర్తి గ్రామానికి చెందిన సాధు పోచయ్య అనే వ్యక్తి గ్రామ సమీపంలోని అంకూసుకుంటలో శనివారం సాయంత్రం చాపల వల వేసి వచ్చాడు. కాగా, ఆదివారం తెల్లవారు జామున చేపలతో ఉన్న వల తీస్తుండగా వల కాళ్లకు చుట్టుకోగా కుంటలో పడి మృతి చెందాడు. పోచయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.