జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని 353c జాతీయ రహదారిలో ఉన్న మైసమ్మ గుడిలోకి బొగ్గు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మైసమ్మ గుడి పూర్తిగా ధ్వంసం అయింది.
స్థానికుల కథనం మేరకు.. భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసిపి 2వ గని వద్ద నుంచి గణపురం మండలం కేటీపీపీకి టిప్పర్లో బొగ్గును రవాణా చేస్తుండగా మార్గమధ్యలో జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న మైసమ్మ గుడిలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో మైసమ్మ గుడి పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను పోలీసులుక్రేన్ సాయంతో బయటకు తీసి దవాఖానకు తరలించారు.