గణపురం :గణపురం మండలంలోని 10 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను, ఒకరికి 50 వేల రూపాయలు ముఖ్యమవత్రి సహయ నిధి చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వేంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. సోమవారం గణపురం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ,ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కరోనా క్లిష్ట పరిస్థితిల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమ పథకాల అమలు జరిపారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్ కుమార్,ఆర్ఐ సాంబయ్య,గణపురం పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి,గణపురం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు, సర్పంచ్ ల పోరం అధ్యక్షుడు పోట్ల నగేష్, సర్పంచ్ లు నారాగాని దేవేందర్ గౌడ్, నడిపెల్లి మధుసూదన్ రావు, తాళ్లపల్లి మంజుల భాస్కర్రావు, ఎంపీటీసీ లు మోటపోతుల శివ శంకర్ గౌడ్, మారగని సరస్వతి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ పోతార్ల అశోక్ యాదవ్, గణపురం టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.