చిట్యాల : గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం అన్నారు. గురువారం మండలంలోని గుంటూర్పల్లి గ్రామంలో చేపడుతున్న బృహత్పల్లె ప్రకృతి నిర్మాణ పనులను, నర్సరీ ఏర్పాట్ల పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ ఈజీఎస్ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలన్నారు. నర్సరీ నిర్మాణ పనులను పూర్తి చేసి విత్తనాలను విత్తడానికి సిద్ధంగా ఉంచాలన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి నిర్మాణ పనులను త్వరగతిన పూర్తి చేసి పండ్లు, పూలు, నీడనిచ్చె మొక్కలను సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో రామయ్య, ఏపీవో అలీంపాషా, సర్పంచ్ పువ్వాటి రాణి, టీఏ స్రవంతి, పంచాయతీ కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.