జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాంరభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. అలాగే పాలకుర్తి మండలంలోని చెన్నూర్,పెద్ద తండా(బి) గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.