సీఎం కేసీఆర్ ఇవాళ జనగాం జిల్లాలో పర్యటించి.. జిల్లాకు పలు వరాలు ఇచ్చిన విషయం తెలిసిందే. జనగాంలో మెడికల్ కాలేజీ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్లో డిగ్రీ కాలేజీని సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజల తరుపున కూడా మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. జనగాంకు మెడికల్ కళాశాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల, విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.