సీఎం కేసీఆర్ ఇవాళ జనగాం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జనగాం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. జనగాంలో మెడికల్ కాలేజీ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రాల్లో డిగ్రీ కాలేజీలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. దీంతో ఎమ్మెల్సీ, తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మూడు వరాలతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జనగాంలో మెడికల్ కాలేజీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కలలు నెరవేరాయని పల్లా స్పష్టం చేశారు.