జనగామ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) సమక్షంలో బీఆర్ఎస్ (BRS ) పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రాల్లో కూడా చేపట్టిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ( Chief Minister KCR) అన్ని వర్గాల అభ్యున్నతికి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారు పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్రే మధు, కోనేటి సుభాషిణి నర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రాం రెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య, సీనియర్ నాయకులు ఏల సోమ సుందర్, బట్ట యాదవగిరి, గొడిశాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారిలో వార్డు మెంబర్ బట్ట వీరమ్మ బలరాం, సీనియర్ నాయకులు బట్ట పరుశరాములు, బట్ట యాదగిరి, మన్ పహాడ్ గ్రామానికి చెందిన సీత, శేఖర్, లలిత, సందీప్, జోగు వెంకటేష్, జోగు ఎల్లేష్, గౌరమ్మ, ఉమేష్, గణేష్ తదితరులు ఉన్నారు.