రఘునాథపల్లి : మండలంలోని నిడిగొండలో డీసీపీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోష్ ఆదేశాల మేరకు ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటినీ సోదాచేసి వాహన పత్రాలు లేని 29 మోటర్ సైకిల్స్, 1ట్రాక్టర్, 1ఆటోను స్థానిక పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనగామ వెస్టుజోన్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ వాహానం కల్గిఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రిజిస్టేషన్, ఇన్స్రెన్స్, డ్రైవింగ్ లైసెన్ ఉండాలని ఆటోలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని. టూవీలర్ నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని సూచించారు.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని లేని పక్షంలో జరిమానాలు తప్పవని పెండింగ్లో ఉన్నచలాన్లను వెంటనే చెలించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ రఘుచందర్, జనగామ రూరల్ సీఐ వినయ్కుమార్, ఎస్సై రాజేష్నాయక్; ఏఎస్సై కనకచంద్రం, పోలీసు సిబ్బంది దేవేందర్, శ్రీనివాస్, తిరుపతి, వెంకన్న,వేణు,బార్గవి, సమీరన్, సర్పంచ్ భిర్రు లక్ష్మి-నర్సయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.