మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్28 : తెలంగాణ ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ కింద సర్కారు సారెగా ప్రతి ఏటా బతుకమ్మ చీరెలను అందించి గౌరవిస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
బుధవారం మద్దూరు మండల కేంద్రంలోని తాజ్మహల్ గార్డెన్లో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరలను అందజేశారు. అదేవిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆశ కార్యకర్తలకు ఎమ్మెల్యే యూనిఫాంలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకమైనదన్నారు.
ఉద్యమంలో పాల్గొన్న మహిళలను గౌరవించుకునేందుకే బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలకు వెలకట్టకూడదని, చీరెలు గౌరవానికి ప్రతికలని తెలిపారు. పార్టీలకతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు.
సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, టీఆర్ఎస్ మద్దూరు, ధూళిమిట్ట మండలాల అధ్యక్షులు మేక సంతోశ్కుమార్, మంద యాదగిరి, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలత, ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్లు నరేందర్, గోపాల్, పీఏసీఎస్ వైస్చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల శాఖ అధ్యక్షులు భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.