KTR | సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్కు తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువా కప్పి సత్కరించారు. కేటీఆర్కు జ్ణాపికను బహూకరించారు.
కులాలకు అతీతంగా జరిపే అద్భుతమైన పండుగ బోనాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు. కానీ సమైక్య రాష్ట్రంలో బోనాలను పట్టించుకోలేదని.. రాష్ట్ర పండుగ్గా గుర్తించలేదని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ బోనాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించారని అన్నారు. తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతోనని కేసీఆర్ చెప్పారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గుడికి రూ.25 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. ఆలయ కమిటీలకు డబ్బులిచ్చి.. పండుగలను ఘనంగా నిర్వహించామని చెప్పారు.
రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని తల్లికి మొక్కుతున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం పచ్చగా ఉండాలని, రైతులు బాగుండాలని అమ్మను వేడుకున్నామని చెప్పారు.