నాడే ఉధృతంగా బంద్లు, రాస్తారోకోలు, నాయకుల అడ్డగింతలు
ఆది నుంచీ మోసం చేస్తున్న కేంద్ర సర్కారు
ఇచ్చేది లేదని ఇటీవల తేల్చి చెప్పిన బీజేపీ
కేంద్రం ధోకాపై మండిపడుతున్న ఉమ్మడి జిల్లావాసులు
వరంగల్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతదని కంటున్న కలలు ఈనాటివి కావు.. ప్రత్యక్షంగా 10వేల మందికి పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి బతుకుదెరువు చూపే ఈ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేయాలని 1979కి ముందు నుంచే పోరాటం కొనసాగుతున్నది. 42 ఏళ్ల క్రితం కూడా బంద్లు, రాస్తారోకోలు, నాయకుల అడ్డగింతలతో నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. ఆది నుంచీ వరంగల్ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చకుండా కేంద్ర సర్కారు మోసం చేస్తూనే వస్తున్నది. పునర్విభజన చట్టంలో పొందుపర్చినా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మరోమారు ధోకా ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కాజీ పేట కోచ్ఫ్యాక్టరీ అనేది వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల చిర కాల వాంఛ. వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ ఫ్యాక్టరీపై ఇక్కడివారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 1979 నుంచే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమాలను మొదలుపెట్టారు. నాలు గు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇలా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో వరంగల్ ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నాయి. తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పూర్తిగా వ్యతిరేకంగా ప్రకటన చేయడం తో ఉమ్మడి జిల్లావాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ఈ భారీ పరిశ్రమను సాధించేదాకా పోరాటం కొనసాగిస్తామని పార్టీలకతీతంగా నాయకులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీయే తర రాజకీయ పార్టీలన్నీ ఈ పోరాటంలో కలిసి వస్తున్నాయి. భారీ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలను వరంగల్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో ప్రజలు సాగించిన పోరా టంతో 40 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తు న్నట్లు ప్రకటించింది. ఇచ్చినట్లే ఇచ్చి రాజకీయ కారణాలతో దాన్ని పంజాబ్కు తరలించింది. కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి రద్దు చేయడంపై అప్పుడే ప్రజలు పోరాడారు. కమ్యూ నిస్టు పార్టీలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగాయి.
వరంగల్ నుంచి కేంద్రప్రభుత్వంలో మంత్రి గా ప్రాతినిధ్యం వహించిన నాయకుడి పర్యటనను కూడా అడ్డుకోవాలని పిలుపునిచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిం చారు. పార్లమెంట్లో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తాలని 1979, నవంబర్8న వరంగల్ జిల్లా బంద్ పాటించి విజయ వంతం చేశారు. నాటి నుంచీ కోచ్ ఫ్యాక్టరీ సాధనే లక్ష్యంగా ప్రజల పోరాటం కొనసాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని పాలకులు పట్టించుకో లేదు. తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్లో పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మన రాష్ర్టానికి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా వరం గల్ ఉమ్మడి జిల్లా వాసుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. దాదాపు ఏడేండ్లుగా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో జాప్యం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వరంగల్ ప్రజలను మోసం చేసింది. వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేసేది లేదని తేల్చి చెప్పి ధోకా ఇచ్చిం ది. నాలుగు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలను బీజేపీ అడ్డుకోవడంతో ప్రజలు, యువకులు, రాజకీయ పార్టీల నాయకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఉద్యమాన్ని కొనసాగించాలని రైల్వే సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. ఈ దిశగా నిరంతరం నిర సన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
చట్టానికి తూట్లు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చేర్పాటు చేయాల్సి ఉంది. 2014 నుంచి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు దీని కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నారు. ఇన్నాళ్లూ వాయి దా వేస్తూ వచ్చిన కేంద్రం, ఇటీవల కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదని తేల్చి చెప్పి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే 10 వేల మందికిపైగా ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. అంత కు రెట్టింపు స్థాయిలో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. పార్ల మెంట్ ఆమోదించిన చట్టంలోనే ఉన్న కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా కేంద్రం నీళ్లొదలడం తెలంగాణపై వివక్ష కాదా అని ఇక్కడి ప్రజలు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. తమ చిరకాల వాంఛగా ఉన్న కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బీజేపీ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని అవసరం లేదని కేంద్రం ప్రక టించినప్పటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు ఉధృ తమవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద అన్ని పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నిరసన కార్యక్రమాలను కొనసా గించేలా కార్మిక సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
ఏళ్లుగా ఎదురుచూపులు
కాజీపేట రైల్వే జంక్షన్ ఉత్తర, దక్షిణ భారతదేశానికి వార ధిగా ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వేలో పెద్ద జంక్షన్ కాజీపేట. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని 1980లో కేంద్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసర మైన 1500 ఎకరాలను సేకరించేందుకు మడికొండ ప్రాంతంలో సర్వే చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్య తో మరోసారి ఎన్నికలు వచ్చి రాజీవ్గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో పంజాబ్లో జరిగిన ఖలిస్థాన్ ఉద్యమం కోచ్ ఫ్యాక్టరీపై ప్రభావం చూపింది. ఖలిస్థాన్ ఉద్యమ నేత లోంగోవాలకు, ప్రధానమంత్రి రాజీవ్గాంధీకి మధ్య జరిగిన ఒప్పందంలో కపుర్తాలలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీంతో కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కపుర్తాలకు తరలిం చింది. అప్పటి నుంచి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్య మాలు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజ న చట్టంలో తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని పొందు పరి చారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లో ఈ ప్రక్రియ మొదలుకా వాలని చట్టంలో పేర్కొన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటైన రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోవడంలేదు. చివరికి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని ప్రకటించి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది.
ఇవి కూడా చదవండి