శివాంశు, ప్రాచీరాయ్ జంటగా రుద్రపట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. రవిశంకర్, వినోద్కుమార్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత వి.ఎస్.పి తెన్నేటి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నాం. నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’ అని తెలిపారు. నటనకు ఆస్కారమున్న పాత్రల్ని పోషిస్తున్నామని నాయకానాయికలు పేర్కొన్నారు.