Gandra Satyanarayana Rao | తన నియోజకవర్గంలో నీళ్ల కొరత, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు తీర్చాలంటూ భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అసెంబ్లీలో స్పీకర్ను కోరారు. అసెంబ్లీలో ఈ విషయమై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు పూరి గుడిసెలు తీసేసి, ఫొటోలు తీసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇళ్లు కట్టొద్దని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు.
ముఖ్యంగా రాంపూర్, ఆజాంనగర్, నాగారం, నందిగామ, కమలాపూర్, ఆముదాల పల్లి, పంబాపూర్ గ్రామాల్లో ఈ సమస్య ఉంది. బోర్లు కానీ, మోటార్లుకానీ వేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా డీబీఎం 31, 38 మొగుళ్లపల్లి మండలంలో పలు గ్రామాలు, శాయంపేట మండలంలోని పెద్దకోడపాక, గోవిందాపూర్ గ్రామాలకు నీరందక నోటికొచ్చే పంటలు ఎండిపోతున్నాయి. అధికారులను వెంటనే ఆదేశించి నీళ్లను విడుదల చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు.
నీళ్ల కొరత, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు తీర్చాలంటూ అసెంబ్లీలో కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యి, బేస్మెంట్ నిర్మించిన తరువాత ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు
నా నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి – భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర… pic.twitter.com/eumuDj40pk
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ