మరిపెడ, మే 13 : గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురై వృద్ధుడు మృతిచెందిన ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారు డీసీ తండాకు చెందిన జాటోత్ లక్ష్మణ్(68) కొత్త తండాలో దుర్గా మాత పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చాడు. భోజనం చేసే క్రమంలో ఎముక ముక్క గొంతులో ఇరుక్కోవడంతో హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలిస్తున్న సమయంలో మృతిచెందాడు. లక్ష్మణ్ మృతితో డీసీ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
Bomb threat | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. కోల్కతా ఎయిర్పోర్టులో హైఅలర్ట్
Migraine | మైగ్రేన్కు ఏడు రోజుల్లోనే శాశ్వత పరిష్కారం.. ఎలాగో తెలుసా..?
Trisha | కాలేజ్ డేస్ నుండే మహేష్ బాబుకి త్రిష పరిచయమా?.. ఏం చెప్పిందంటే..!