Trisha | కాలేజ్ డేస్ నుండే మహేష్ బాబుకి త్రిష పరిచయమా?.. ఏం చెప్పిందంటే..!సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. వీరిద్దరు అతడు సినిమాలో నటించగా, అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వేస్తే చాలు చాలా ఇంట్రెస్ట్గా ఎంతోమంది చూస్తూ ఉంటారు. ఒక రకంగా టీవీలో బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే అతడు అనే అంటారు అందరూ. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బుల్లి తెరపై మాత్రం మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో త్రిష, మహేష్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
బావ ప్రేమకోసం ఎదురుచూసే పల్లెటూరి అమ్మాయిగా త్రిష పాత్రలో ఒదిగిపోయింది. ఇక మహేష్ బాబు కూడా కాస్త యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ సీరియస్గా చాలా అద్భుతంగా నటించారు. వారిద్దరి పాత్రలకి ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యారు. అతడు తర్వాత త్రిష మహేష్ బాబు కలిసి సైనికుడు సినిమా చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత త్రిష, మహేష్ బాబు కలిసి నటించలేదు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి త్రిష ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహేష్ బాబు తన ఫెవరెట్ హీరోల్లో ఒకరు అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ .. మహేష్ బాబు సెట్ లో చాలా సరదాగా ఉంటాడని, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అని పేర్కొంది..
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా అందరిని చాలా గౌరవిస్తాడు. అసలు కారవాన్ లోకి కూడా వెళ్లడు. తన షూటింగ్ అయిపోయినా కూడా .. మానిటర్ దగ్గర కూర్చొని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నాకు చాలా కాలం నుంచి తెలుసు. మేము ఇద్దరం కాలేజ్ డేస్లో చెన్నైలో ఉన్నాము. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ టైం లో మేము యాక్టర్స్ అవుతామని ఊహించలేదు. అప్పుడు హాయ్, బాయ్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేది అని త్రిష పేర్కొంది. ఇక ఈ అమ్మడు చాలా రోజుల తర్వాత తెలుగులో చిరంజీవితో విశ్వంభర చేస్తుంది. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆఫ్రికన్ అడావుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు గరుడ, గోల్డ్ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట.