హనుకొండ : వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో బుధవారం బాంబులు పెట్టినట్టు ఆగంతకుడు డీసీపీ ఆఫీస్కి మెయిల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన వరంగల్ పోలీసు కమిషనరేట్ బాంబు, డాగ్ స్కాడ్ సిబ్బంది రెండు జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీల తరువాత ఫెక్ కాల్గా పోలీసులు నిర్ధారించారు. బాంబు బెదిరింపుతో కలెక్టరేట్ ఉద్యోగులు ఆందోళన చెందారు. ఫెక్ కాల్ అని నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..