వర్గల్, ఏప్రిల్ 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జనరంజకంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీసమేత నృసింహమూర్తి హంసవాహనం పురవీధుల్లో ఊరేగారు. ఆలయ ప్రధాన పూజారులు శ్రీవట్టికోట కృష్ణామాచార్యుల నేతృత్వంలో ఉదయం దేవతామూర్తులకు విశేష పంచామృతాభిషేకాలు జరిగాయి. అనంతరం నూతన వస్ర్తాలంకరణలో కొలువుదీరిన దేవతామూర్తులను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.వడిబియ్యాలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. దేవిని పేరిట సత్యనారాయణ వ్రతాలు జరిపించుకున్నారు.అంతకు ముందు శనివారం అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగిన దేవదేవుని కల్యాణం అత్యంత నిష్టాగరిష్టంగా భక్తిశ్రద్ధలతో ముగిసింది. ఈ వేడుకలలో జడ్పీ చైర్పర్సన్ వేలేటిరోజాశర్మ దంపతులతోపాటు ఆలయ పాలకమండలి చైర్మన్ హనుమంతరావు దంపతులు, పాలకమండలి సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష్మీనృసింహస్వామి గజవాహన సేవలో ఊరేగనున్నారు. భక్తులు విధిగా మాస్క్లు ధరించేలా, భౌతికదూరం పాటించేలా ఆలయ ఈవో తన సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
విద్యాధరిక్షేత్రంలో ఘనంగా మూలానక్షత్ర పూజలు
వర్గల్ విద్యాధరిణి సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో ఆది వారం మూలానక్షత్ర పూజలు ఘనంగా ఆలయ వ్యవ స్థాపక అధ్యక్షులు శ్రీయాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉయమే అమ్మవారికి విశేష పంచా మృతాభిషేకం నిర్వహించారు. లక్షపుష్పార్చన, కుంకు మార్చన, చండీహోమం నిర్వహించారు. ప్రత్యేక అలం కరణ సేవల అనంతరం కొలువుదీరిన సరస్వతీ మాతను భక్తులు దర్శించుకొని తరించారు. కొవిడ్ నిబంధనల మేరకు శానిటైజర్, మాస్క్ ధరించిన వారికి భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించారు.