హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ మాన్యువల్ను తయారు చేసేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ప్రత్యేక కమిటీని నియమించింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మాన్యువల్నే జీఆర్ఎంబీ పాటిస్తూ వస్తున్నది.
దీనిపై ఇప్పటికే తెలంగాణతోపాటు, ఏపీ సైతం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆఫీస్ మాన్యువల్ను తయారుచేసేందుకు బోర్డు సుముఖత వ్యక్తం చేసింది. అందులో భాగంగా బోర్డు మెంబర్ సెక్రటరీ నేతృత్వంలో ఇరు రాష్ర్టాల ఈఈలతో కలిపి ప్రత్యేకంగా కమిటీని నియమించింది.