హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): భాషాపండితులకు పదోన్నతులు కల్పించేందుకు టెట్ అవసరంలేదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తక్షణమే స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ(ఎస్ఎల్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
జూన్ 12లోపు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తిచేసింది. ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రవర్తుల శ్రీనివాస్, కర్రెం గౌరీశంకర్రావు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.