Jr NTR | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రి వైద్యులు అధికారిక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇటీవల భుజానికి గాయపడిన ఎన్టీఆర్కు కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ (Arthroscopic Surgery) నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు మరియు డాక్టర్ శ్రీనివాస రావు సూరపనేని ఆధ్వర్యంలోని నిపుణులైన వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సాంబిత్ సాహు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
వైద్యుల పర్యవేక్షణలో ఆయన త్వరలోనే ప్రత్యేక పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలతో రాబోయే 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఆయన పూర్తిగా కోలుకుని తన సాధారణ దినచర్యకు తిరిగి వస్తారని వైద్యులు ప్రకటించారు.