ఖైరతాబాద్, మే 4: నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్ ఆఫ్ గ్లాస్గో డాక్టర్ బీరప్పను ‘డిప్లొమా ఆఫ్ ఫెల్లోషిప్ ఎఫ్ఆర్సీఎస్’కు ఎంపిక చేసింది.
486 ఏండ్ల ఈ కళాశాల చరిత్రలో ప్రభుత్వ రంగ దవాఖాన సర్జన్కు కేటాయించడం ఇదే ప్రథమం. డైరెక్టర్ బీరప్ప వైద్యవృత్తిలో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడంతో పాటు పేద రోగులకు నాణ్యమైన సేవలు వేగంగా అందించేలా చొరవ తీసుకొన్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో ఆయన ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు.