ఖానాపురం, ఆగస్టు 1 : కులమతాలకు అతీతం స్నేహబంధం. రంగు, రూపం, ధనిక, పే ద తేడాలు లేని పవిత్ర బంధం. ఒక ఫ్రెండ్ కష్టా ల్లో ఉంటే తోటి స్నేహితులు సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కష్టాల కడలిలో ఉ న్న మిత్రుల కుటుంబాలకు ఫ్రెండ్షిప్ డే సాక్షిగా మేమున్నామంటూ ముందుకు వచ్చి అండగా నిలిచారు తోటి స్నేహితులు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన బోడ ఫూల్సింగ్ -మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు. ఫూల్సింగ్ ఈజీఎస్లో టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించేవాడు. ఈక్రమంలో మంజుల అనారోగ్యానికి గురై 2018లో మృతిచెందింది. 2019 డిసెంబర్లో భార్య సంవత్సరీకం రోజు రాత్రి గుండెపోటుతో ఫూల్సింగ్ సైతం మృతిచెందాడు. దీంతో పిల్లలను ఫూల్సింగ్ తమ్ముడు నర్సు చేరదీసి చదివిస్తున్నాడు. కాగా, ఫూల్సింగ్తో కలిసి 2002లో హైదరాబాద్ సీబీఐటీ కళాశాలలో బీటె క్ పూర్తిచేసిన అతడి మిత్రులకు ఈ విషయం తెలిసింది. దేశ విదేశాల్లో వివిధ హోదాల్లో ఉన్న 60 మంది మిత్రులు కలిసి రూ.10 లక్షలు సమకూర్చారు. స్నేహితుల దినోత్సవం గుర్తుగా మిత్రులు ఆదివారం ఖానాపురంలో అతడి స్నేహితుడి ఇం టికి వెళ్లి పిల్లలు అభినాష్, చరణ్కు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, టీఆర్ఎస్ నాయకులు నాగమళ్లేశ్వరరావుతో కలిసి రూ.10లక్షల నగదు అందజేశారు. దామోదర్రెడ్డి, శరత్బాబు, సుస్మి త, రఘు, శేఖర్, శ్రీకాంత్, కిరణ్, మేర్వాన్, అని ల్, అయ్యప్ప, హైమావతి, సూర్య పాల్గొన్నారు.
శభాష్ ఫ్రెండ్స్..
గూడూరు : కరోనాతో చనిపోయిన స్నేహితు డి కుటుంబాన్ని తోటి మిత్రులు ఆదుకున్నారు. మండల కేంద్రంలోని చంద్రగూడెం ప్రాంతానికి చెందిన గడ్డం సురేశ్ ఇటీవల కరోనాతో మృతిచెందాడు. సురేశ్కు భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్ల లు. కాగా, సురేశ్ కుటుంబానికి అతడి పదో తర గతి స్నేహితులు రూ. లక్షా 30వేలు అందజేశా రు. సురేశ్ కుమార్తెల పేరుపై పోస్టాఫీస్లో డిపాజిట్ చేసి బాండ్ అందించారు. ముంతపురపు నర్సయ్య, మేర్గు నరేశ్, బానోత్ వెంకన్న, నూనావత్ కిషన్, బుర్ర శ్రీనివాస్, బానోత్ శ్రీనివాస్, సంతోష్, యశోద, ఫర్హానా పాల్గొన్నారు.