హైదరాబాద్ : గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా దిగిజారి మాట్లాడలేదు. ఆర్థిక విధానల్లో బీజేపీ పూర్తిగా విఫలమైందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో(BJP rule) దేశంలో నిత్యావసర ధరలు(Essentials prices) విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ రైతుల ప్రయోజనాలకు విరుద్దంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఉద్యమిస్తే తప్పా వాటిని రద్దు చేయలేదన్నారు. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఉంటే భర్తీ చేయడలం లేదని ఆరోపించారు. అగ్నివీర్ పథకం దేశ సంరక్షణకు ప్రమాదకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో(Parliament eletions) బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.