కరీమాబాద్ : ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తెలిపారు. బుధవారం దసరా ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు సంబందించిన ఆల్బమ్ను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ మాట్లాడుతూ.. ఉర్సు రంగలీల మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్లు చేపట్టేలా చొరవ చూపుతానన్నారు.
కార్యక్రమంలో దసరా కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి వెంకన్నగౌడ్, ఉత్సవ కన్వీనర్ నొడ్నాల నరేందర్ ఉపాధ్యక్షులు మేడిది మధుసూదన్, వెలిదె శివమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శులు గోనె రాంప్రసాద్, వంచనగిరి సమ్మయ్య పాల్గొన్నారు.