వరంగల్ : సీజనల్ వ్యాధుల పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. 10 గంటల 10నిముషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం 62వ డివిజన్ సోమిడి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. ఇంట్లో, పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ పర్యటనలో గ్రామంలో షాపు నిర్వాకులు చెత్తను రోడ్డుపై వేయడాన్ని గమనించిన ఆమె జరిమానా విధించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవిందర్ యాదవ్, బల్దియా చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, శానిటరి ఇన్స్పెక్టర్ రవీందర్, హెల్త్ ఇన్స్పెక్టర్ రవి పాల్గొన్నారు.