ధర్మారం, మే 4: ‘పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును సోషల్ మీడియాలో ఎండగట్టినవ్.. ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పని చెయ్యి.. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని సోషల్ మీడియా వారియర్ సల్వాజీ మాధవరావును కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ మాధవరావు, ప్రభుత్వ వ్యతిరేక పోస్టు పెట్టినందుకు అరెస్ట్ అయి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు.
గోదావరిఖని లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ రాగా కొప్పుల చొరవతో మాధవరావు, అతని సోదరి మాధవి ఇల్లెందు గెస్ట్హౌస్లో పార్టీ అధినేతను శనివారం కలిశారు. ఈ సందర్భంగా మాధవరావుకు అన్ని విధాలా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీయే పరమావధిగా భావించి పనిచేస్తున్న తనకు కొండంత ధైర్యాన్నిచ్చి నట్లయిందని, కేసీఆర్కు రుణపడి ఉంటానని మాధవరావు తెలిపారు.